“మహర్షి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న 26వ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనీల్ సుంకర, దిల్రాజు, మహేష్ నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. “సూపర్స్టార్ మహేష్ బాబుగారు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్లో పూర్తయింది. ఆయనతో వర్క్ చేయడం అద్భుతంగా ఉంది. ఈ నెల 26 నుంచి హైదరాబాద్లో సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది. సెకండ్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నాను” అని అనిల్ రావిపూడి తన ట్వీట్లో తెలిపారు.
previous post
బ్రేక్ లేకుండా 30 గంటలు చేయగలను : రకుల్ ప్రీత్ సింగ్