telugu navyamedia
రాజకీయ వార్తలు

మరో రెండు చైనా యాప్ లను నిషేధించిన ఇండియా

cell phone

భారత్-చైనా సరిహద్దులో ఇటీవల జరిగిన ఘటనల అనంతరం చైనాకు భారత్ బుద్ధి చెప్పింది. ఆ దేశానికి చెందిన 59 యాప్ లను జూన్ 29న నిషేధించింది. భారత రక్షణకు ఆటంకం కలిగిస్తున్నాయనే కారణంతో వీటిపై నిషేధం విధించింది. తాజాగా మరో రెండు చైనా యాప్ లపై భారత్ నిషేధం విధించింది. ట్విట్టర్, గూగుల్ కు ప్రత్యామ్నాయాలుగా ఉన్న వీబో, బైడు సెర్చ్ లను ఇండియా నిషేధించింది.

ఇంటర్నెట్ ప్రొవైడర్ల నుంచి ఈ రెండు యాప్ లను తీసేయాలని ఆదేశించింది. మరోవైపు వీటిని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా వీటిని తొలగించారు. మరిన్ని చైనా యాప్ లను నిషేధించే యోచనలో కూడా భారత్ ఉన్నట్టు తెలుస్తోంది. -చైనా యాప్ లపై భారత్ నిషేధం విధించిన తర్వాత చైనా యాప్ లపై ఇతర దేశాలు కూడా కొరడా ఝుళిపించడం మొదలు పెట్టాయి.

Related posts