telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బండి సంజయ్ ఓ దేశ ద్రోహి..

MLC-Palla-Rajeshwar-Reddy

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ghmc ఎన్నికల్లో టీ ఆర్ఎస్ సామాజిక న్యాయం పాటించిందని ....బిసిలకు 75, ఎస్సిలకు 13, ఎస్టీ లకు 3 సీట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. కొన్ని జనరల్ సీట్లను కూడా ఎస్సీ, ఎస్టీ లకు ఇచ్చామన్నారు. బిజెపి నేతలు మాట్లాడే తీరు వారి సంస్కృతి కి అద్దం పడుతుందని… బిజెపి గెలిస్తే ఇంటికి 25 వేలు ఇస్తారట..వరదలు వచ్చినప్పుడు వీళ్ళు ఎవరైనా కనిపించారా అని నిలదీశారు. వరద సాయం ఆపాలని బిజెపి నేతలు ఎన్నికల సంఘానికి, ghmcకి లేఖ ఇచ్చింది వాస్తవమని తెలిపారు. బిజెపి గెలిస్తే చాలన్ ను రద్దు చేస్తారట… వాళ్ళు చేసిన చట్టాన్ని వాళ్ళే ఉల్లంగిస్తరట అంటూ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ దేశ ద్రోహి, చట్టాలను ఉల్లంగిస్తున్నాడని… బండి సంజయ్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. బండి సంజయ్ సవాల్ విసరాలని అనుకుంటే చార్మినార్ టెంపులే దొరికిందా…. వేరే గుడులు లేవా..అని ప్రశ్నించారు. దొంగే దొంగే అన్నట్లు వరద సహాయం ఇవ్వకుండా ప్రజల పొట్ట కొట్టారని..పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని సూచించారు. అసత్య ప్రచారాలు బీజేపీ మానుకోవాలని…కేంద్రం ఎక్కడ డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. తాగి డ్రైవ్ చేసి చేయాలా…ఏ విధంగా మాపీ చేస్తా అంటున్నారు..చట్టంలో మార్పులు చేసి డబ్బులు పెంచింది కేంద్రం ఏ కదా అని నిలదీశారు. Ghmc ఎన్నికల్లో ప్రజలు బీజేపీ కి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

Related posts