telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గాంధీ మార్గం ఎప్పటికీ అచరణీయం: కేసీఆర్

telangana cm kcr on CAA

మహాత్మా గాంధీ అనుసరించిన మార్గం ఎప్పటికీ అచరణీయమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అహింస సత్యాగ్రహ సిద్ధాంతాల ద్వారా ప్రపంచానికి శాంతి సందేశం అందించారన్నారు.

సత్యాగ్రహ దీక్షతో గాంధీజీ అనేక సమస్యలకు పరిష్కారం చూపెట్టారని కొనియాడారు. ఆయన చూపెట్టిన మార్గంలో జాతి పయనిస్తూ.. ఆయన కలలుకన్న భారతదేశాన్ని ఆవిష్కరించాలని పేర్కొన్నారు. సత్యాగ్రహం ద్వారా ఎంతటి కష్టసాధ్యమైన లక్ష్యాన్నైనా సాధించవచ్చని మహాత్మాగాంధీ నిరూపించారని చెప్పారు.

Related posts