తెలంగాణలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం పల్లెలను కూడా వణికిస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కొవిడ్ 19 కేసుల వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,381 కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,021 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,81,627కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,50,160 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,080కు చేరింది. ప్రస్తుతం 30,387 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 386 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.