తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొత్తగా 1,296 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 45,076కి పెరిగింది.
అత్యధికంగా జీహెచ్ఎంసీలో ఇవాళ 557 కేసులను గుర్తించారు. తాజాగా 1,831 మందిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం 12,224 మంది చికిత్స పొందుతున్నారు. ఈ ర్పి మరో ఆరుగురు కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 415కు చేరుకుంది.