telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

లోకేష్ పై .. నాని సెటైర్లు ..

kesineni nani tdp

కనీస జ్ఞానం లేనివాళ్లు కూడా ఇష్టానికి కొన్ని వాడేస్తూ.. ఆయా టెక్ పరువు తీసేస్తున్నారు అంటూ కేశినేని పేరు చెప్పకుండానే సెటైర్లు వేశాడు. తాజాగా ఆయన ఏమీ తెలియని వారు, ఏమీ చేయలేని వారు కూడా ట్వీట్లు చేస్తుండటం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.

“నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు. దౌర్భాగ్యం!” అని నాని వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ ను ఎవరిని ఉద్దేశించి పెట్టారో మాత్రం ఆయన చెప్పక పోవడం గమనార్హం. ఇక దీనిపై “భలే చెప్పావు మీ లోకేశం గురించి” అని, “పక్కా ట్వీటేశ్ గురించేగా?” అని, “లోకేష్ గారి గురించి బాగా చెప్పారు” అని కామెంట్లు వస్తుండటం గమనార్హం. ఇక తాను చేసిన ట్వీట్ లోకేశ్ గురించా? అన్న విషయాన్ని మాత్రం నాని ఇంకా స్పష్టం చేయలేదు.

Related posts