telugu navyamedia
రాజకీయ వార్తలు

కల్నల్ సంతోష్ కుటుంబానికి కేంద్రం అండగా ఉంటుంది: కిషన్ రెడ్డి

Kishan Reddy

భారత్-చైనా సరిహద్దుల్లో ఇటీవలే అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట వెళ్లిన ఆయన సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతోష్ బాబు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

సంతోష్ బాబు ఏ లక్ష్యం కోసం ప్రాణత్యాగం చేశాడో ఆ లక్ష్యాన్ని ప్రధాని మోదీ నెరవేరుస్తారని ఉద్ఘాటించారు. భారత సైన్యం సంతోష్ కుటుంబానికి అండగా ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సరిహద్దుల్లో సమస్యలు సృష్టిస్తున్న చైనాకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ ప్రపంచదేశాల మద్దతు కూడగడుతున్నారని వెల్లడించారు.

Related posts