గతంలో దేశం కోసం అనేక పదవులలో తనదైన శైలిలో సేవలు అందించి, మెప్పించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన వద్ద తగిన డబ్బులేదని వ్యాఖ్యానించారట. పదేళ్ల పాటు భారతావనికి ప్రధానిగా పనిచేసిన ఆయన వద్ద కోర్టుకు వెళ్లడానికి డబ్బులు లేవట. ఈ విషయాన్ని ఏపీ మాజీ ఎంపీ, తన మిత్రుడు యలమంచిలి శివాజీతో ఆయనే స్వయంగా చెప్పారట.
ఇటీవల బాలీవుడ్ నుండి ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరిట మన్మోహన్ బయోపిక్ తెరకెక్కగా, ఈ సినిమా ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలు మన్మోహన్ ను కించపరుస్తున్నట్టు కనిపించడంతో వివాదం చెలరేగింది. ఈ విషయమై కోర్టును ఆశ్రయించి, పరువు నష్టం దావా వేయాలని మన్మోహన్ సింగ్ కు కొందరు సలహా ఇచ్చారట. ఇదే విషయాన్ని శివాజీ వద్ద ప్రస్తావించిన మన్మోహన్ సింగ్, కోర్టులో పోరాడేందుకు తన వద్ద డబ్బులు లేవని, న్యాయవాదులకు భారీగా ఫీజులు చెల్లించలేనని అన్నారట.