హైదరాబాద్లో దాక్కొని చంద్రబాబు తన చెంచాలను అడ్డుపెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి అనిల్ కుమార్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు వయసు మళ్లింది కాబట్టి ఇంట్లో ఉంటే తప్పులేదని, పక్క రాష్ట్రంలో కూర్చొని రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలును హైకోర్టు అడ్డుకుంటే టీడీపీ నేతలకు ఆనందంగా ఉందనిన్నారు. పేదలకు ఉన్నత విద్యను అందించాలని సీఎం జగన్ తపన పడుతుంటే ఎలా అడ్డుకోవాలా అని టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ నేతలు, పత్రికాధినేతలు తమ పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ను అమెరికాలో చదివించుకోవచ్చా? మనవడు దేవాన్ష్ను తెలుగు మీడియంలో ఎందుకు చేర్పించలేదని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తామన్నారు. రాబోయే 20 ఏళ్లలో మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా తయారుచేస్తామన్నారు.
కాంగ్రెస్ ఓడిపోవడానికి పార్టీ నేతలే కారణం: బీహార్ పీసీసీ