ఆఫ్ఘనిస్థాన్ లో కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి. దీంతో వరదల్లో చిక్కుకొని 100 మంది మరణించారని అధికారులు చెప్పారు. ఛారికర్ సెంట్రల్ సిటీలోని ఆసుపత్రి వరదనీటి పాలవడంతో అందులో ఉన్న రోగులను కాబూల్ నగరంలోని ఆసుపత్రికి తరలించామని ఆఫ్ఘనిస్థాన్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ మంత్రి గులాం బహవుద్దీన్ జిలానీ చెప్పారు.
వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లలో ప్రజలు మరణించి ఉన్నారని, పోలీసులు, సహాయ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయని, వరద మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. వరదల వల్ల గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి ప్రతినిధి అబ్దుల్ ఖాసిం చెప్పారు. కాబూల్ జాతీయ రహదారిపై ఇద్దరు పిల్లలు వరదనీటిలో మునిగిపోయారని అధికారులు తెలిపారు.