రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై రాష్ట్ర ప్రభుత్వా తీరును ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. వీటిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలున్నప్పటికీ, విద్యుత్ కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాత బకాయిల కింద తక్షణమే పీపీఏలకు రూ.1,400 కోట్లు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్ట్ ఆదేశించింది.