రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. అధికారుల సమాచారం మేరకు రాష్ట్రపతి ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ గారిని గాంధీనగర్లోని ఆమె నివాసంలో కలుసుకున్నారు.
ఆమెతో కాసేపు మాట్లాడిన రాష్ట్రపతి ఆమె బాగోగులు తెలుసుకున్నారు. ప్రధాని తల్లిని చూస్తే తన తల్లిని చూసినట్లే ఉందని రాష్ట్రపతి ఈ సందర్భంగా అన్నట్లు సమాచారం. ఆమెతో మాట్లాడినంత సేపు తాను చాలా సంతోషానికి గురైనట్లు ఆయన తెలిపారు. ఈ వయసులోనూ ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందనీ, ఇలాంటి వారు మనందరికీ ఆదర్శప్రాయులని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.