పసిడి ధరలు మళ్ళీ తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 180 రూపాయిల తగ్గుదలతో 39,680 రూపాయలకు చేరింది.అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 170 రూపాయిల తగ్గుదలతో 36,370 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 50 రూపాయిలు తగ్గుదలతో 46,800 రూపాయలకు చేరింది. .
అంతర్జాతీయంగా కొనుగోలు దారుల డిమాండ్ భారీగా తగ్గిపోవడంతో పసిడి ధరలపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహ దృక్పథం కారణంగా బంగారం, వెండి తగ్గుతూ వస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. వాల్స్ట్రీట్ సరికొత్త గరిష్ఠ స్థాయిలు నమోదు చేయడం కూడా బంగారం పెట్టుబడులకు దూరం చేసింది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.