లాక్ డౌన్ లో సడలింపులివ్వడంతో ప్రత్యేక రైళ్లతో పాటు, పలు రాష్ట్రాల్లో ప్రజా రవాణా ప్రారంభమైంది. ఇక ఈనెల 25 నుంచి దేశీయ పౌర విమాన సర్వీసులు విడతల వారీగా ప్రారంభంకానున్నాయి. విమాన కార్యకలాపాలకు సిద్ధంగా ఉండాలని అన్ని ఎయిర్లైన్స్, ఎయిర్పోర్టులకు పౌర విమానయానశాఖ సూచించింది. ఈ నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
ప్రయాణికుల భద్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై పౌరవిమానయాన శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా గత మార్చిలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రతి విమానంలో పరిమిత స్థాయిలో ప్రయాణికులను అనుమతించనున్నారు. భౌతిక దూరం తప్పకుండా పాటించేలా సీట్లను కేటాయించనున్నారు.
జీఎస్టీతో చిన్న వ్యాపారులు నష్టపోయారు: రాహుల్