తమిళనాడులో ఓ కలక్టర్ తమ కూతురు ను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. తమ పిల్లల భవిష్యత్ కోసం ప్రయివేటు స్కూళ్లల్లో చదివించాలని ప్రభుత్వ అధికారులు కోరుకుంటారు. మూడు సంవత్సరాల వయసున్నప్పుడు తమ పిల్లలను ప్లే స్కూల్స్ లో చేర్పిస్తారు. కానీ తిరునేల్ వేలి కలెక్టర్ శిల్ప ప్రభాకర్ సతీష్ తన కుమార్తెను ప్లే స్కూల్లో చేర్పించకుండా అంగన్ వాడీ సెంటర్లో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా కలెక్టర్ శిల్ప మాట్లాడుతూ.. సమాజంలోఅన్ని వర్గాలతో కలిసిపోయే విధంగా తన కుమార్తె పెరగాలని చెప్పారు. ఈ కారణంతోనే తాను నర్సరీ స్కూల్ స్థానంలో అంగన్ వాడీ సెంటర్ ను ఎంపిక చేసుకున్నానని స్పష్టం చేశారు. మిగతా స్కూళ్లతో పోల్చితే శిక్షణ పొందిన టీచర్లతో పాటు అంగన్ వాడీ కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.