telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

భూకుంభకోణం పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు: విజయసాయి

Mp vijayasai reddy

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల  దేవాలయాలపై జరుగుతోన్న దాడులపై టీడీపీ నేతలు వైసీప్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తోన్న వ్యాఖ్యలపై  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.

‘భూకుంభకోణం నుంచి దృష్టి మరల్చడానికి చంద్రబాబు లేని ఎజెండాను ఎత్తుకున్నాడని విజయసాయి విమర్శలు గుప్పించారు. విజయవాడలోనే డజన్ల కొద్ది ఆలయాలను కూలగొట్టాడు. బీజేపీ కొన్ని వర్గాలకు వ్యతిరేకమంటూ ఎన్నికల ముందు నానా హంగామా చేశాడు. కశ్మీర్ నుంచి కూడా నాయకులను తీసుకొచ్చి ప్రచారం చేసిన విషయాన్ని ఎవరూ మర్చిపోరు’ అని విజయసాయి ట్వీట్ చేశారు.

Related posts