అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఈ నెల 11న సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం లాక్డౌన్పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఈ రోజు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో టీడీపీ తరపున పాల్గొన్న గల్లా పాల్గొన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్డౌన్ను కనుక మరింత కాలం పొడిగిస్తే రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం యోచిస్తోందని ఆయన తెలిపారు. వైసీపీ నేతలు సమాజ సేవను కూడా స్థానిక ఎన్నికల కోసం వాడుకుంటున్నారని జయదేవ్ ఆరోపించారు. ప్రస్తుత కష్టకాలంలో రాజకీయాలు తగవని హితవు పలికారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలివేయాలని ప్రధానిని కోరినట్టు గల్లా తెలిపారు.
చిదంబరం కేసులకు ఆధారాలు: నితిన్ గడ్కరీ