telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇంగ్లాండ్ కు ఫాలో ఆన్ ప్రమాదం…

మొదటి టెస్ట్ లో భారత్ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇంగ్లాండ్ ఉంది. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ కు ఫాలో ఆన్ ప్రమాదం ఉంది. అయితే ప్రమాదం చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు రెండో సెషన్ పూర్తయింది. అయితే ఈ మ్యాచ్ పై ఇప్పటికే భారత్ పట్టు బిగించింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 329 పరుగులకు ఆల్ ఔట్ కాగా ప్రస్తుతం ఇంగ్లాండ్ 106/8 తో ఉంది. అయితే తొలి టెస్ట్‌లో విఫలమైన భారత బౌలర్లు.. రెండో టెస్ట్‌లో సత్తా చాటుతున్నారు. అంతకు ముందు 300 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్… 329 పరుగులకు ఆలౌటైంది. ఈరోజు ఆట ప్రారంభమైన తర్వాత కేవలం 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఇండియా కూడా మరో రెండు వికెట్లు తీస్తే ఇంగ్లాండ్ ను ఆల్ ఔట్ చేస్తుంది. అయితే మరో 23 పరుగుల లోపు ఇంగ్లాండ్ ను ఆల్ ఔట్ చేస్తే వారిని ఫాలో ఆన్ లో పడేయవచ్చు. చుడాలిమరి ఏం జరుగుతుంది అనేది… ఇంగ్లాండ్ ఫాలో ఆన్ ను తప్పించుకుంటుందా.. లేదా అనేది.

Related posts