telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఆరోగ్యశ్రీ పేరిట మోసాలు.. బ్యాంకు వివరాలు చెప్పొద్దు: ట్రస్టు సీఈఓ

arogyasri ysr

ఆరోగ్యశ్రీ కార్డుల పేరిట మోసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓ డాక్టర్ మల్లికార్జున్ హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ప్రభుత్వం మీ ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తుందని కొందరు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్ నెంబరు, ఓటీపీ అడుగుతారని తెలిపారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మోసాలకు పాల్పడే అలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇలాంటివే కొన్ని ఆడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో కూడా దర్శనమిస్తున్నాయని అన్నారు. వాటితో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు ఎలాంటి సంబంధంలేదని ఆయన వెల్లడించారు.

Related posts