పంజాబ్ లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిస్తున్నట్లు అమరీందర్ సింగ్ సర్కార్ బుధవారం ప్రకటించింది. పంజాబ్ లో ఇప్పటివరకు మొత్తం 99 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 8 మరణాలు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 20 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు 14మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. పంజాబ్ లో ఇప్పటివరు 2,559 శాంపిల్స్ టెస్ట్ చేయగా, 2,204 శాంపిల్స్ నెగిటివ్ వచ్చాయి. 256 శాంపిల్స్ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు ఏప్రిల్-14తో లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చేవరకూ లాక్ డౌన్ కొనసాగించాలని భావిస్తున్నట్టు కేంద్రం తెలిపింది.