telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి: స్పీకర్ పోచారం

pocharam srinivasreddy

రైతులకు అవసరమైన గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నాయని తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ఏ-గ్రేడ్ ధాన్యం రూ.1,835.. సాధారణ రకం ధాన్యం రూ.1,815తో కొనుగోలు జరుగుతుందని తెలిపారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 223 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో గతేడాది 1.37 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా ఈ ఏడాది 2 లక్షల ఎకరాల్లో సాగు చేశారన్నారు. గత ఏడాది 3.67 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా ఈ ఏడాది 4.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరగనున్నట్లు తెలిపారు.

Related posts