మహిళలకు ఏడాదికి రూ.18,750 ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.మహిళలు చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు, ఆర్థిక అవసరాల నిమిత్తం, వారి కుటుంబాలు పురోభివృద్ధిలో పయనించేందుకు నాలుగు సంవత్సరాల్లో రూ.18 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు అందించనున్నామని తెలిపారు. ఈ నిర్ణయంతో సుమారు 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మహిళలు లబ్ది పొందుతారని చెప్పారు.
జగనన్న తోడు’ అనే పథకం ప్రవేశపెడుతున్నామని, ఈ పథకం అక్టోబరు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు.చిరువ్యాపారాలు చేసుకునేవారు, ఆర్థికంగా వెనుకబడినవారు దీని ద్వారా ఆర్థికసాయం అందుకుంటారని వివరించారు. ఈ పథకంలో సున్నా వడ్డీ కింద రూ.10 వేలు అందజేస్తామని వెల్లడించారు.
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.. చంద్రబాబు డిమాండ్