telugu navyamedia
రాజకీయ వార్తలు

హైదరాబాద్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కు ఘనస్వాగతం

Ram Nath Kovind

ఒక్కరోజు పర్యటన నిమిత్తం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు హైదరాబాద్ విచ్చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు తెలంగాణ గవర్నర్ తమిళి సై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం కేసీఆర్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానమందిరాన్ని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ పంచాయతీలో ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ధ్యాన మందిరాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ సందర్శించనున్నారు. రెండేళ్ల క్రితం రామ్ నాథ్ కోవింద్ ఈ ధ్యాన మందిరానికి శంకుస్థాపన చేశారు.

Related posts