telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విమానాల సంఖ్యను పెంచండి..కేంద్ర మంత్రికి జగన్ లేఖ

cm jagan ycp

లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రులను క్షేమంగా రప్పించేందుకు విమానాల సంఖ్యను పెంచాలని ఏపీ సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు జగన్ లేఖ రాశారు. ఎక్కువ విమానాలను నడిపి ప్రవాసాంధ్రులను రాష్ట్రానికి తీసుకురావాలని విన్నవించారు. ఏపీలోకి చార్టెడ్ ఫ్లైట్స్ ను అనుమతించాలని కిర్గిజ్ స్థాన్, కతార్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా తదితర దేశాల్లోని తెలుగు సంఘాలు కోరుతున్నాయని చెప్పారు.

విదేశాల నుంచి వచ్చే వందే భారత్ విమానాలు కానీ, చార్టెడ్ ఫ్లైట్స్ కానీ ఎన్ని వచ్చినా ఆహ్వానించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏపీకి వందే భారత్ విమానాల సంఖ్యను పెంచడమే కాకుండా, అక్కడి ప్రవాసాంధ్రులు ఏపీకి వచ్చేందుకు వీలుగా చార్టెడ్ ఫ్లైట్స్ ను అనుమతించాలని కోరారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ చాలా గొప్పదని జగన్ ప్రశంసించారు.

Related posts