చెపాక్ స్డేడియం వేదికగా మొదటి వన్డే లో వెస్టిండీస్ బౌలర్లు క్రమశిక్షణతో బంతులేస్తుంటే, భారత ఆటగాళ్లు తడబడిపోతున్నారు. స్పీడ్స్టర్ కాట్రెల్ స్లో బంతులతో బ్యాట్స్మెన్ను ఇబ్బందిపెడుతున్నాడు. తాను వేసిన తొలి ఐదు ఓవర్లలో ఏకంగా మూడు ఓవర్లు మెయిడిన్ కావడం విశేషం. అతని బౌలింగ్లో టీమ్ఇండియా ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. కాట్రెల్ దెబ్బకు భారత్ 7 ఓవర్లలోనే 25 పరుగులకు రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. కాట్రెల్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఓపెనర్ కేఎల్ రాహుల్(6) హెట్మైర్ చేతికి చిక్కాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(4) తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులకు పరుగులేమీ రాబట్టలేదు. ఐదో బంతిని ఫోర్ బాది బౌలర్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. కాట్రెల్ పేస్ మారుస్తూ బంతులేస్తుండగా ఐదో బంతిని కోహ్లీ థర్డ్మ్యాన్ వైపు బాదాలని ప్రయత్నించగా బంతి బ్యాట్ ఎడ్జ్కు తాకి వికెట్లపైకి దూసుకెళ్లింది. దీంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసిన కాట్రెల్ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. 11 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్లకు 39 పరుగులు చేసింది. రోహిత్(21), శ్రేయాస్ అయ్యర్(5) క్రీజులో ఉన్నారు. హిట్మ్యాన్ భారత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దుతున్నాడు.
చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఏం నమ్మకం ఇవ్వగలడు: విజయసాయి