ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గండికోట ముంపు వాసులకు శుభవార్త అందించారు. రాష్ట్ర ప్రభుత్వం గండికోట ముంపు వాసుల పరిహారం కోసం రూ. 553 కోట్లు విడుదల చేసింది. అదేవిధంగా ఎన్నికల హామీల్లో భాగంగా అదనంగా ఇస్తామన్న పరిహారానికి కూడా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీంతో ముంపు వాసులకు అదనంగా రూ.3 లక్షల 25 వేలు పరిహారాన్ని విడుదల చేశారు.
అదనంగా పెంచిన మొత్తంతో ముంపు వాసులకు పరిహారంగా రూ. 10 లక్షలు అందనున్నాయి. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంపై గండికోట ముంపు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో వైఎస్ జగన్ రైతు పక్షపాతిగా మరోసారి నిరూపించుకున్నారని ప్రశంసల జల్లు కురిపించారు.