telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

గుడ్ న్యూస్ : ఏపీలో తగ్గిన కరోనా కేసులు

CQVI Virus

ఏపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. కానీ ఇవాళ మాత్రం ఏపీలో కరోనా కేసులు చాలా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో నమోదు అయిన కరోనా కేసుల విషయానికొస్తే 3,224 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా కేసులు 758951 కు చేరువలో ఉన్నాయి. ఇక నిన్నటితో పోలిస్తే కరోనా మరణాలు ఇవాళ పెరిగాయి. ఈరోజు 32 మంది కరోనా తో మరణించారు.దీంతో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 6256కు చేరుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 758951 పాజిటివ్ కేసులకు గాను, 708712 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 43983 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా కరోనా మరణాలు తగ్గిన కూడా తూర్పు గోదావరి, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలని విజ్ఞప్తి చేశారు.

Related posts