telugu navyamedia
వార్తలు సామాజిక

దేశంలో కరోనా ఉగ్రరూపం.. 59 లక్షలు దాటిన కేసులు!

corona covid

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గతంలో పట్టణాల్లో వ్యాపించే ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను సైతం వణికిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 85,362 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,03,933కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,089 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 93,379కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 48,49,585 మంది కోలుకున్నారు. 9,60,969 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. నిన్నటి వరకు మొత్తం 7,02,69,975 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది.

Related posts