విశాఖలో లాంగ్ మార్చ్ బహిరంగ సభలో జనసేన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైసీపీ నేతల పై నిప్పులు చెరిగారు. మంత్రి కురసాల కన్నబాబుపై పవన్ మండిపడ్డారు. నాగబాబు కారణంగానే కన్నబాబు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఇప్పుడా కన్నబాబు తనను విమర్శిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపైనా మండిపడ్డారు.
ఫ్యాక్షన్ తరహా విధానాలకు భయపడే వ్యక్తిని కాదని తెలిపారు. ఎంతో గొప్పవాళ్లు కూర్చునే రాజ్యసభలో సూట్ కేసు కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు కూర్చోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి గారూ మీరు కూడా నన్ను విమర్శిస్తే ఎలాగండీ అంటూ హితవు పలికారు. రెండు చోట్ల ఓడిపోయానని, అందుకే భవన నిర్మాణ కార్మికుల సమస్యపై మాట్లాడే నైతికత లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానిస్తున్నాడని మండిపడ్డారు.