telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వామన్ రావు హత్య కేసు : సంచలన విషయాలు బయటపెట్టిన పుట్టా మధు

హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు దంపతులను కాపుకాచి నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా విచక్షణా రహితంగా దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే..అయితే   వామన్ రావు హత్య కేసు రోజు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్టా మధును అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేశారు. అంతేకాదు పుట్టా మధు భార్యను కూడా పోలీసులు విచారించారు. అయితే ఈ విచారణలో పుట్టా మధు అసలు నోరు విప్పలేదు. అయితే తాజాగా మరోసారి పుట్టా మధును పోలీసులు విచారించారు. ఈ సందర్బంగా పుట్టా మధు సంచలన వ్యాఖ్యలు బయట పెట్టారు. వామన్ రావు హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. వ్యక్తిగత కక్షలతోనే కుంట శ్రీను, బిట్టు శ్రీను హత్య చేసి ఉంటారని పుట్టా మధు పేర్కొన్నారు. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని కూడా పేర్కొన్నారు. 

Related posts