telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం ఆర్టీసీ కార్మికులను బెదిరిస్తున్నారు: చాడ వెంకటరెడ్డి

chada venkat reddy cpi

తెలంగాణ సీఎం కేసీఆర్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సుమారు 45 వేల మంది బతుకులను పణంగా పెట్టి సమ్మె చేస్తున్నా  కేసీఆర్‌ పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం లేదని, ఆర్టీసీ కార్మికుల సమస్యల తరపున పోరాటం చేస్తున్నాయని తెలిపారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్.. కొత్త బస్సులు ఎందుకు కొనలేకపోయారని ప్రశ్నించారు.

ఆర్టీసీ కార్మికుల సెల్ఫ్ డిస్మిస్ ఎటు పోయిందో తెలియదు.. మళ్లీ అవకాశం ఇస్తున్నా అనే మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచన చేయకుండా కర్కశంగా తయారయ్యారని ఆరోపించారు. కేబినెట్‌లో కేసీఆర్‌కి ఎదురుచెప్పే మంత్రులు లేరని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె జరుగుతుంటే దానిపై మంత్రివర్గ ఉపసంఘం ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.

Related posts