telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

“హే మళ్లీ ఏసేశాడు” .. పోస్టులన్నీ ఒకే సామాజిక వర్గానికే: రఘురామకృష్ణరాజు

Raghuramakrishnaraju ycp mp

వైసీపీ ప్రభుత్వాన్ని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి టార్గెట్ చేశారు. ఏపీలో ఒక సామాజిక వర్గానికే అత్యధిక పోస్టులు లభిస్తున్నాయని ఆరోపించారు. కీలక స్థానాల్లో వాళ్లే ఉన్నారంటూ వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. అర్హతలు లేకపోయినా కేవలం ఓ సామాజిక వర్గం వారికే పోస్టులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఎక్కడైనా రెండు పోస్టులు ఉంటే ఒకటి ఆ సామాజిక వర్గానికి, రెండోది ఇతరులకు ఇస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘దూకుడు’ సినిమాలో మహేశ్ బాబు పలికిన “హే మళ్లీ ఏసేశాడు” అనే డైలాగును వినిపించారు. మంచి చేస్తే మూడు దశాబ్దాలు ఉంటారని, ఈ విషయం సీఎం జగన్ ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఫలానా శాఖలో ఈ రెడ్డి.. ఫలానా శాఖలో ఆ రెడ్డి అంటూ ఏపీలో అత్యధిక పోస్టుల్లో కొనసాగుతున్న ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి పేర్లను ఆయన చదివి వినిపించారు.

Related posts