బీహార్ లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం ఇప్పటికే మద్యనిషేధం విధించి, మందుబాబులకు షాక్ ఇచ్చింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ మసాలా అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. పాన్ మసాలా అమ్మకాలు, నిలువ, రవాణా అన్నింటిపై నిషేధం అమల్లోకి వచ్చింది. నిషేధాజ్ఞలను ఎవరు ఉల్లంఘించినా కఠినంగా శిక్షిస్తామని బీహార్ చీఫ్ సెక్రటరీ దీపక్ కుమార్ హెచ్చరించారు.
పాన్ మసాలా అమ్మకాలు, నిలువ, రవాణా, వినియోగాలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంటుందని, దీనికి సంబంధించి ఒక పక్కా ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉందని చెప్పారు.ఆరోగ్యానికి హాని కలిగించే మెగ్నీషియం కార్బొనేట్ పాన్ మసాలాల్లో ఉన్నట్టు ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ల్లో తేలింది. ఈ రసాయణం గుండె సంబంధిత రుగ్మతలకు కారణమవుతుంది. ఈ నేపథ్యంలోనే, పాన్ మసాలాపై ప్రభుత్వం బ్యాన్ విధించిందని దీపక్ కుమార్ తెలిపారు.
టీడీపీ అందించిన సైకిళ్లకు వైసీపీ స్టిక్కర్లు: నారా లోకేశ్