telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఒకడి ఇష్టానుసారం నడిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి: పవన్

pawan-kalyan

ఒకడి ఇష్టానుసారం నడిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇసుక కొరతపై లాంగ్ మార్చ్‌లో ఆయన విశాఖలో పాల్గొన్నారు. అనంతరం పవన్ మాట్లాడుతూ వైసీపీలో ఏకస్వామ్యం మాత్రమే ఉందిని, ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. తాను కష్టాల్లో ఉన్న ప్రజలకు దత్తపుత్రుడినని చెప్పారు. తమ పాలసీలు సరిగా లేనప్పుడు ఎలా పరిపాలిస్తారని ఆయన ప్రశ్నించారు.

అజయ్‌కల్లామ్‌ లాంటి ఆలోచనపరులు ఉండి కూడా ఎందుకిలా చేస్తున్నారని నిలదీశారు. సీఎం జగన్‌ ప్రభుత్వంలో డిబేట్లు లేవని, ఆలోచనలు పంచుకోవడం కూడా లేదని పవన్ వ్యాఖ్యానించారు. జగన్ ఇష్టానుసారం చేసుకుంటూ పోతున్నారని, అందుకే ఇలా జరుగుతుందని పవన్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనట్లుగా ఇక్కడే ఇసుక కొరత ఎందుకు ఉంది. కూలీలు ఎందుకు చనిపోతున్నారు?. జీవనాధారం పోయిందని ఆవేదన పడుతూ సెల్ఫీ వీడియోలు తీసి కూలీలు చనిపోతున్నారు. ఇంత కంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? అని పవన్ ప్రశ్నించారు.

Related posts