ముఖ సినీ నటుడు అలీ ఇప్పటివరకు వివిధ పార్టీ నేతలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. టీడీపీ, వైసీపీ, జనసేన అధ్యక్షులతో సమావేశమై ఎట్టకేలకు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఉదయం వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నటుడు అలీ భేటీ అయ్యారు. అనంతరం అలీ వైసీపీ కండువా కప్పుకున్నారు. అలీకి పార్టీ కండువా కప్పి పార్టీ అధినేత వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. నిన్నటి వరకు అలీ టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. టికెట్పై జగన్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో అలీ వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.
previous post