telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఈవీఎంల సెక్యూరిటీని నిరూపించటానికి సిద్దం: రజత్‌ కుమార్‌

rajanth kumar
ఈవీఎంలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌  తెలిపారు. ఈవీఎంల సెక్యూరిటీని నిరూపించటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈవీఎంల భద్రత పై ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈవీఎంలపై వస్తున్న ఆరోణల గురించి కేంద్రం ఇప్పటికే క్లారిటీ ఇచ్చిందని పేర్కొన్నారు. 1982 నుంచే ఈవీఎంలను వాడుతున్నామని రజత్ కుమార్ తెలిపారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
ఈవీఎంల గురించి కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణల పట్ల తానేమీ స్పందించనన్నారు. ప్రస్తుతం తాము పార్లమెంట్‌ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఓటర్ల కోసం 1950 హెల్ప్‌లైన్‌ను లాంచ్‌ చేశామని తెలిపారు. ఓటర్లకు ఎటువంటి అనుమానాలున్న 1950కి కాల్‌ చేయవచ్చన్నారు. ఎన్నికల సందర్భంగా సోషల్‌ మీడియాపై కూడా ఆంక్షలుంటాయని ఆయన వెల్లడించారు.

Related posts