telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అప్పుడే శ్రామిక దినోత్సవం సంపూర్ణం: ఆర్కే రోజా

mla roja app for public service

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరిగిన రోజు శ్రామిక దినోత్సవం సంపూర్ణం అవుతుందని వైసీపీ నేత ఆర్కే రోజా తెలిపారు.సోషల్ మీడియా లో ఆమే ఈరోజు కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..అందుకోసమే వైసీపీ అధినేత జగన్ ‘అమ్మ ఒడి’ పథకం తీసుకొస్తున్నారని చెప్పారు.

‘అమ్మ ఒడి’పథకంతో పిల్లలు పనికి వెళ్లకుండా బడికి వెళతారని వ్యాఖ్యానించారు. దానిలో భాగంగానే పిల్లలు పనికి కాదు బడికి వెళ్ళాలి అని అమ్మ ఒడి పథకం ద్వారా ముందడుగు వేస్తున్నారు మన జగనన్న’ అని ట్వీట్ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున గెలుపొందిన రోజా మరోసారి అదే స్థానం నుంచి మొన్నటి ఎన్నికల్లో బరిలో దిగారు.

Related posts