కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య (71) ఛాతీ నొప్పితో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు సిద్దరామయ్య గుండెకు రక్తం సరిగా సరఫరా కావడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సిద్దరామయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, భయపడాల్సిందేమీ లేదని వైద్యులు తెలిపారు. తన తండ్రి గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్టు సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర మీడియాకు తెలియజేశారు.
సిద్దరామయ్య నేటి మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాగా, తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను సిద్దరామయ్య ఖండించారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆసుపత్రిలో చేరానని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. అవును వీళ్లంతా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎందుకు చేరరు!!