telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన గవర్నర్‌

biswabhusan harichandan governor

విజయవాడ ప్రభుత్వాసుపత్రిని శుక్రవారం ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పరిశీలించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పేదలకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వార్డుల్లో రోగులను పరామర్శించి యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించారు.

ఆరోగ్యశ్రీ వార్డు, ఆపరేషరేషన్‌ థియేటర్లు, సర్జికల్‌ ఐసియూ,డయాలసిస్‌, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ విభాగాలను పరిశీలించి..వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు. వైద్య సదుపాయాలపై స్వయంగా రోగులను అడిగి తెలుసుకొని సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

Related posts