గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ ప్రచార సభ లో పాల్గొన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ కుటుంబ పెద్దగా నా విజ్ఞప్తి… ఎన్నికల్లో పిచ్చి ఆవేశాలకు పోకండి… రెచ్చగొట్టే మాటలకు లొంగకండి. భూముల రేట్లు పడిపోతాయ్.. ఆ స్తుల ధరలు పడిపోతాయి… మంచి అభ్యర్థులను పెట్టినం.. గెలిపించండి అని అన్నారు. ఏకపక్షంగా ఇంకో 5 సీట్లు ఎక్కువ ఇచ్చి ఆశీర్వదించండి. వెకిలి మాటలు..సమాజాన్ని విభజించే మాటలకు లొంగకండి. హైదరాబాద్ మీది.. దీన్ని యువత కాపాడుకోవాలి అని సూచించారు. నన్ను కూడా..రారా పోరా అంటున్నారు. కానీ నేను మాట్లాడటం లేదు. నేను తల్చుకుంటే దుమ్ము దుమ్ము… నశం కింద కొడతా అని హెచ్చరించారు. మాకు బాసులు ప్రజలు.. మా బాసులు ఢిల్లీలో ఉండరు. మీ చిల్లర మాటలకు టెంప్ట్ కాము మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. కానీ… మేము టెంప్ట్ కావడం లేదు అని తెలిపారు. గతంలో కంటే నాలుగు సీట్లు ఎక్కువే వస్తాయి. గెలిచినకా కొత్త జవసత్వాలు తో మళ్ళీ మొదలుపెడతాం అని కేసీఆర్ ప్రజలకు తెలిపారు.
previous post
డ్రోన్ కెమెరాలంటే చంద్రబాబుకు ఎందుకు భయం: ఎమ్మెల్యే రోజా