telugu navyamedia
తెలంగాణ వార్తలు

సీఎం కేసీఆర్‌ జార్ఖండ్‌ పర్యటనపై వైఎస్‌ షర్మిల ట్వీట్‌..

తెలంగాణ సీఎం కేసీఆర్ జార్ఖండ్ పర్యటనపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు.. ‘గాల్వన్‌లో అమరులైన సైనిక కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వడం తప్పు కాదు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడంలో తప్పులేద‌న్నారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చేయరు అని నిల‌దీశారు.

తెలంగాణలో రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించక అనేక మంది మరణించారని, అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అనేక మంది అమరులయ్యారని చెప్పారు. మరి వారి కుటుంబాలకు కేసీఆర్ ఎందుకు సాయం చేయరని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

కనీసం నష్టపోయిన పంటకు పరిహారం ఎందుకివ్వరు?. సొంత రాష్ట్రం వారిని అల్లం, బయటి వారిని బెల్లం చేసుకోవడమేనా బంగారు భారత్‌కు బాట?’ అంటూ వైఎష్‌ షర్మిల సీఎం కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.

Related posts