నేటితో రాష్ట్రంలోని 8 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 8 మంది ఐఏఎస్ అధికారులు ఇంఛార్జ్ వీసీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కొత్త వీసీలను నియమించే వరకు ఇంఛార్జ్లే వీసీలుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఇంఛార్జ్ వీసీల వివరాలు :
ఉస్మానియా యూనివర్సిటీ- అరవింద్ కుమార్ ఐఏఎస్
జేఎన్ టీయూహెచ్ – జయేశ్ రంజన్, ఐఏఎస్
కాకతీయ యూనివర్సిటీ-డాక్టర్ బీ జనార్దన్ రెడ్డి, ఐఏఎస్
తెలంగాణ యూనివర్సిటీ-వీ అనిల్ కుమార్, ఐఏఎస్
పాలమూరు యూనివర్సిటీ-రాహుల్ బొజ్జా, ఐఏఎస్
మహాత్మాగాంధీ యూనివర్సిటీ-అరవింద్ కుమార్, ఐఏఎస్
పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ-వీ అనిల్ కుమార్ ఐఏఎస్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం-సి. పార్థసారథి, ఐఏఎస్
మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు: విజయసాయిరెడ్డి