*ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలపై సీఎం కేసీఆర్ స్పందన
*అర్హత పరీక్షలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గిస్తాం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్, ఎస్సై పరీక్ష రాసిన అభ్యర్థులకు తీపి కబురు ఇచ్చారు.
ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గించనున్నట్లు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కటాఫ్ మార్కులు 20 శాతం తగ్గించాలంటూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం ఈ ప్రకటన చేశారు.ఈ విషయమై అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ నియామక పరీక్షలో ఓసీ అభ్యర్థులకు 20 మార్కులు తగ్గించినట్లే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తగ్గించాలని ప్రతిపక్ష నేతలు, కొందరు అభ్యర్థులు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో వారి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి అందరికీ ఒకే కటాఫ్ మార్కులను తగ్గించనున్నట్లు ప్రకటించారు.
పోలీస్ శాఖలో మొత్తం 15,644 ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 28న నిర్వహించారు. అనంతరం కీ పేపర్ను విడుదల చేశారు. అయితే 5 ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు తప్పుగా ఉన్నాయని వాదనలు వినిపించాయి.
దీంతో అభ్యంతరాలను స్వీకరించిన బోర్డు త్వరలోనే తుది ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించారు. ఇంతలోపే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఆందోళనలు మొదలు పెట్టారు