telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

తండ్రి మరణం తట్టుకోలేక గోదారిలో దూకిన కూతురు

sai priya

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన తండ్రి మరణం తట్టుకోలేక కూతురు గోదావరి నదిలో దూకింది. మంగళవారం జరిగిన సంఘటన గోదావరిఖని గంగానగర్ గోదావరి బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా చెన్నూరు కు చెందిన అరవెల్లివసంతం సోమవారం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

కాగా వసంతం మృతదేహాన్ని ఆంబ్యులెన్స్ లో తీసుకెళ్తుండగా, కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తున్న వసంతం కూతురు ఆరవెల్లి సాయి ప్రియ (32) వాంతులు వస్తున్నాయి అనడంతోడ్రైవర్ కారును గోదావరి బ్రిడ్జి వద్ద నిలిపివేశాడు. వెంటనే సాయి ప్రియ కిందికి దిగి గోదారిలో దూకి గల్లంతయింది. కుటుంబ సభ్యుల కళ్లెదుటే సాయి ప్రియ గోదావరి నదిలో మునిగిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. కాగా సాయి ప్రియ మంచిర్యాల జిల్లా కోటపల్లి ఎస్సీ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది.

Related posts