telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జిల్లాల్లో వెంటనే కరోనా ల్యాబ్ లు ఏర్పాటు చేయాలి: సీఎం జగన్

కరోనా ల్యాబ్ లు లేని జిల్లాల్లో వెంటనే ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఈ రోజు  కొవిడ్-19 నివారణ చర్యలపై జగన్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు సీఎంకు కరోనా నివారణ చర్యల గురించి వివరించారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 6,928 పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.

ప్రభుత్వ స్కూళ్లలో నాడు-నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలపైనా జగన్ సమీక్ష చేపట్టారు. పాఠశాలల్లో ఫర్నీచర్, చాక్ బోర్డులు తదితర వస్తు సామగ్రి కోసం టెండర్లు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా వచ్చే విద్యాసంవత్సరానికి గాను స్కూలు పిల్లలకు ఇవ్వనున్న యూనిఫాం దుస్తులు, స్కూలు బ్యాగులను పరిశీలించారు.

Related posts