telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ…

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని ఖరారు చేసింది తెలుగుదేశం పార్టీ… పార్టీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు.. కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. కేశినేని శ్వేత మేయర్ అభ్యర్థి అంటూ టీడీపీ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, మున్సిపల్ ఎన్నిల సమయంలో.. టీడీపీలో గ్రూప్ విభేదాలు బయటపడ్డాయి.. నువ్వు ఎంత? అటే నువ్వెంత అంటూ సీనియర్ నేతలు బహిరంగ విమర్శలకు దిగారు.. అయితే, రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నేతలను పిలిచి సముదాయించి పంపారు.. మేయర్ అభ్యర్థిగా ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపించినా.. చివరకు కేశినేని శ్వేత వైపే మొగ్గు చూపింది అధిష్టానం. కాగా, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 11వ డివిజన్‌ నుంచి బరిలోకి దిగిన కేశినేని శ్వేత ఇప్పటికే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన డివిజన్‌తో పాటు.. ఇతర డివిజన్లలో టీడీపీ, మిత్ర పక్షాల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థుల తరపున కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.

Related posts