హైదరాబాద్లో రంగుల పండుగ హోలీ సందర్భంగా నేటి(బుధవారం) నుంచి ఈ నెల 22వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు, అంటే మూడు రోజులపాటు ని మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ మేరకు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నగర ప్రజలు హోలీని ఆనందంగా జరుపుకోవాలని కోరిన ఆయన వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఈ నెల 20 నుంచి మూడు రోజులపాటు నగర వ్యాప్తంగా ఉన్న అన్ని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా హోలీ జరుపుకోవాలని, గుంపులుగా వాహనాలపై ప్రయాణించవద్దని, వాహనాలపై వెళ్తున్న వారిపై రంగులు చల్లరాదని సీపీ హెచ్చరికలు జారీ చేశారు.