సుకుమార్ ‘రంగస్థలం’ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రస్తుతం అల్లు అర్జున్తో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన నటిస్తోంది. మరో హీరోయిన్ పాత్రలో కేరళ కుట్టి నివేదా థామస్ కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు. రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సూపర్ మాస్ లుక్లో కనిపించనున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే సుకుమార్ ఈ సినిమా తర్వాత చేసే సినిమాను ఇస్మార్ట్ శంకర్ రామ్తో చేయనున్నాడట. ఈ ఇద్దరి కాంబినేషన్లో పదమూడు సంవత్సరాల కింద జగడం వచ్చిన సంగతి తెలిసిందే. గూండాయిజం, గొడవలు నేపథ్యంలో వచ్చిన ఆ మూవీ కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేదు. ఈ కాంబినేషన్ మళ్ళీ ఓ మూవీ రానుందంటూ ఓ వార్త ప్రచారం లోకి వచ్చింది. రామ్ తో మూవీ చేయాలని సుకుమార్ భావిస్తున్నాడట. ఇప్పటికే సుకుమార్, రామ్ కి స్టోరీ కూడా నేరేట్ చేశాడని టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్ సినిమా పూర్తవ్వగానే రామ్ మూవీ స్టార్ట్ కానుందని సమాచారం.ప్రస్తుతం రామ్ రెడ్ మూవీలో నటిస్తున్నాడు.