కోల్ కతాలో బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ‘ఇదొక అద్భుత విజయం. భారత్ అద్భుత విజయాలను సాధించడం 2000లో గంగూలీ నాయకత్వంలో ప్రారంభమైంది. తమపై గంగూలీ ప్రభావం చాలా ఉంది’ అని చెప్పాడు.
కోహ్లీ వ్యాఖ్యలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించారు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడం వల్లే కోహ్లీ ఇలా వ్యాఖ్యానించి ఉండవచ్చని అన్నారు. 1970, 1980లలో కూడా భారత్ విజయాలను సాధించిందని చెప్పారు. అప్పటికి కోహ్లీ ఇంకా పుట్టనేలేదని అన్నారు. 2000లోనే క్రికెట్ ప్రారంభమైందని ఇంచా చాలా మంది అనుకుంటున్నారని గవాస్కర్ విమర్శించారు. కానీ, అంతకన్నా 30 ఏళ్ల క్రితమే భారత్ విదేశీ గడ్డపై మ్యాచుల్లో గెలుపొందిదని చెప్పారు.
ఆర్టీసీ కార్మికుల ఆగ్రహ జ్వాలల్లో కేసీఆర్ బుగ్గి: మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ